రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-31T06:02:29+05:30 IST

రైతులకు సరిపడే సాగు నీరందించడమే ప్రభు త్వ లక్ష్యమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

రైతులకు సాగు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
కాలువ పూడిక తీత పనులు ప్రారంభించిన శ్రీకాంత్‌రెడ్డి

 డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి 

ధర్మపురి, జూలై 30: రైతులకు సరిపడే సాగు నీరందించడమే ప్రభు త్వ లక్ష్యమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ధర్మపురి శివారులో గల అక్కపెల్లి చెరువు కింది బోదునయ్య కాలువ పూడి కతీత పనులను శుక్రవారం ఆయన కొబ్బెరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత కాలం నుంచి ఈ కాలువలో పి చ్చి మొక్కలు మొలచి, మట్టి నిండి పంట పొలాలకు సక్రమంగా నీరంద డం లేదని తెలిపారు. దీంతో రైతులు తమ సమస్యను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దృష్టికి తీసుక వెళ్లారని ఆయన పేర్కొన్నా రు. వెంటనే మంత్రి ఈశ్వర్‌ స్పందించి సంబంధిత శాఖ అధికారులకు ఆ దేశాలు జారీ చేయగా కాలువ పూడికతీత పనులు ప్రారంభించామని వి వరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌కుమార్‌, రైతుబంధు అధ్యక్షుడు ఒ డ్నాల మల్లేశం, బురుదేశిపల్లె ఉపసర్పంచ్‌ రాజేష్‌, కోఆప్షన్‌ మెంబర్‌ వ సంత్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-31T06:02:29+05:30 IST