స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-01-21T06:12:02+05:30 IST
మండలంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
తుమ్మపాల, జనవరి 20: మండలంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పారిశుధ్యం మెరుగుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో దోమల నివారణకు మండలానికి రూ.12 లక్షల 50వ ేలు విలువ చేసే ఫాగింగ్ మిషన్లను అందజేస్తున్నామని చెప్పారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు మాట్లాడుతూ, మండలంలో ప్రతీ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ బీవీ సత్యవతి, కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్కుమార్, మళ్ల బుల్లిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, ఎంపీడీవో సత్యశ్రీనివాస్ పాల్గొన్నారు.