ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రవీంద్ర

ABN , First Publish Date - 2021-06-22T06:52:57+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్‌ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే రవీంద్ర
డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

డిండి, జూన్‌ 21: రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కే సీఆర్‌ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. సోమవారం డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక, వైకుంఠధామం, ఆదర్శ పాఠశాల వంటగదిని ప్రారంభించి కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునిత జనార్ధన్‌రావు, జడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు, రైతుబంధు మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు, ఎంపీడీవో గిరిబాబు, ఎంపీటీసీలు బూషిపాక వెంకటయ్య, రాధిక, దేవరకొండ మార్కెట్‌కమిటి చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌లు నాగార్జునరెడ్డి, మాధవరం శ్రీనివాసరావు, సర్పంచ్‌ మేకల సాయమ్మకాశయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-22T06:52:57+05:30 IST