తాబేళ్లు దత్తత తీసుకున్న చిన్నారి

ABN , First Publish Date - 2020-10-24T08:59:42+05:30 IST

: జూపార్క్‌లోని రెండు తాబేళ్లను నాలుగేళ్ల అక్షయ్‌ చక్రవర్తి అనే బాలుడు దత్తత తీసుకున్నాడు. ఈ రెండు తాబేళ్ల ఏడాది పోషణకు అవసరమైన రూ. 30 వేల చెక్కును

తాబేళ్లు దత్తత తీసుకున్న చిన్నారి

మదీన, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): జూపార్క్‌లోని రెండు తాబేళ్లను నాలుగేళ్ల అక్షయ్‌ చక్రవర్తి అనే బాలుడు దత్తత తీసుకున్నాడు. ఈ రెండు తాబేళ్ల ఏడాది పోషణకు అవసరమైన రూ. 30 వేల చెక్కును శుక్రవారం బాలుడి తల్లిదండ్రులు క్యూరేటర్‌ ఎన్‌. క్షితిజకు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారిని జూ అధికారులు, సిబ్బంది అభినందించారు. తూర్పు ఆఫ్రికా దేశమైన చెసెల్లా ప్రధానమంత్రి 2018లో భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఈ తాబేళ్లను మన రాష్ట్రపతికి కానుకగా అందించారు. రాష్ట్రపతి వాటిని నగరంలోని జూపార్క్‌నకు తరలించారు.  

Updated Date - 2020-10-24T08:59:42+05:30 IST