పాలనకు రెవెన్యూ అవసరం: మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2022-04-06T21:58:56+05:30 IST

పాలనకు రెవెన్యూ అవసరమని మంత్రి

పాలనకు రెవెన్యూ అవసరం: మంత్రి బుగ్గన

విజయవాడ: పాలనకు రెవెన్యూ అవసరమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. నగరంలో జరిగిన ఏపీ వాణిజ్య పన్నుల శాఖ స్వర్ణోత్సవ వేడుకల్లో  ఆయన పాల్గొని మాట్లాడారు.  పాలనకు రెవిన్యూ అవసరమని,  మొదట్లో ల్యాండ్ నుంచి ఇది వచ్చేదని ఆయన తెలిపారు. మన దేశంలో ఎక్కువ మొత్తం పన్నులు పరోక్ష విధానంలో  వస్తున్నాయన్నారు. ఇంటిలిజెన్స్, లిటిగేషన్ల పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రం లో మనం తీసుకోవడానికి అంతో ఇంతో మంచి  పద్ధతులు ఉన్నాయన్నారు. ప్రతి ఉద్యోగి కనీసం ఒక నెల కమర్సియల్ టాక్స్ డిపార్ట్మెంట్లో  పనిచేయాలని  ఆయన సూచించారు. అప్పుడే ఆ ఉద్యోగికి సంపాదన ఎంత కష్టమో తెలుస్తుందన్నారు. రియల్ బిజినెస్ డెవలప్మెంట్ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రారంభం అయిందని, శ్రీ సిటీ అప్పుడే వచ్చిందని ఆయన తెలిపారు. 2019 లో అప్పులు పెండింగ్ ఉండిపోవడంతో ఆ ప్రభావం ఇప్పటికీ పడుతోందన్నారు. 2019 తరువాత మనం ఎగుమతులలో 7 వ స్థానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్నామన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం అందరి సంక్షేమం  చూస్తుందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-04-06T21:58:56+05:30 IST