Shocking Incident: కొంచెమైనా కన్న తల్లిలా ఆలోచించి ఉంటే బాగుండేది.. పాపం ఆ అమ్మాయి..

ABN , First Publish Date - 2022-07-20T02:19:32+05:30 IST

కడుపున పుట్టిన కొడుకునైనా, కూతురినైనా కన్న తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తను పస్తులుండి మరీ పిల్లల కడుపు..

Shocking Incident: కొంచెమైనా కన్న తల్లిలా ఆలోచించి ఉంటే బాగుండేది.. పాపం ఆ అమ్మాయి..

తేని: కడుపున పుట్టిన కొడుకునైనా, కూతురినైనా కన్న తల్లి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తను పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపుతుంది. ఏ తల్లైనా కన్న బిడ్డలతో ఇలానే వ్యవహరిస్తుంది. కానీ.. ఈ ఫొటోలో కనిపిస్తున్న తల్లి ఇందుకు పూర్తి భిన్నం. తన విలాసాల కోసం కూతురి మానాన్నే అమ్మేసిన అమ్మ ఈవిడ. ఈ మహిళ పేరు ముత్తు‌చెల్వి. తమిళనాడులోని (Tamilnadu) తేని (Theni) జిల్లా అల్లినగరంలోని కకంజి కాలనీకి చెందిన ముత్తుచెల్వి, జయరామ్ భార్యాభర్తలు. వీరికి 16 ఏళ్ల వయసున్న కూతురు (Teenage Girl) ఉంది. ఈ బాలిక ఒక ప్రైవేట్ స్కూల్‌లో (Private School) 11వ తరగతి చదువుతోంది. జయరామ్ కుటుంబ పోషణ నిమిత్తం కేరళలో (Kerala) ఉద్యోగం చేస్తుండేవాడు. ముత్తుచెల్వికి ఈ క్రమంలోనే ఒక సినీ దర్శకుడైన (Film Director) కెన్నెడీతో పరిచయం ఏర్పడింది.



ఈ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి (Extra Marital Affair) దారి తీసింది. తంజావూరుకు (Thanjavur) చెందిన ఈ సినీ దర్శకుడికి రకమ్మల్ అనే చైల్డ్ ఆర్టిస్ట్‌లను సప్లయ్ చేసే ఏజెంట్‌‌ ద్వారా ముత్తుచెల్వి పరిచయమైంది. తన కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్‌ను చేయాలని భావించిన ముత్తుచెల్వి ఆ ఆలోచనను పూర్తిగా పక్కనపెట్టి దర్శకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం కొన్నాళ్లకు ముత్తుచెల్వి కూతురికి తెలిసింది. అయితే.. అతనితో అఫైర్ కొనసాగిస్తున్న విషయం మీ నాన్నకు గానీ.. మరెవరికైనా గానీ చెబితే తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానని కూతురిని ముత్తుచెల్వి బెదిరించింది. దీంతో.. ఆ బాలిక విషయం తెలిసినా ఎవరితో చెప్పలేదు.



ఈ క్రమంలో.. ముత్తుచెల్వి కూతురిని చూసిన దర్శకుడు కెన్నెడీ నీచమైన ఆలోచన చేశాడు. ఆ అమ్మాయితో తన లైంగిక వాంఛ తీర్చుకోవాలన్న ఆలోచనను ఆ బాలిక కన్న తల్లి అయిన ముత్తుచెల్వికి చెప్పాడు. తొలుత ఆలోచించినప్పటికీ.. ఆ తర్వాత ఆ నీచపు ఆలోచనకు ముత్తుచెల్వి అంగీకారం తెలిపింది. ఒకరోజు ఆ బాలిక తాగే కాఫీలో నిద్రమాత్రలు కలిపి ఆ కాఫీని కూతురికి ముత్తుచెల్వి ఇచ్చింది. ఆ బాలిక కాఫీని తాగి మత్తులోకి వెళ్లాక ఆ దర్శకుడు ఆమెను మానభంగం చేశాడు. అయితే.. తనపై మానభంగం జరిగిందని గ్రహించిన ఆ బాలిక తీవ్ర మనోవేదన చెందింది. పెదనాన్న వాళ్ల ఇంటికి వెళ్లి తల్లి నీచత్వాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. ఆ బాలిక చెప్పింది విని షాకయిన ఆమె పెదనాన్న కూతురు ఆ బాలికను వెంటబెట్టుకుని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఈ ఫిర్యాదుతో బాలిక తల్లిపై, ఆ సినీ దర్శకుడిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-20T02:19:32+05:30 IST