నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి

ABN , First Publish Date - 2020-10-01T08:57:19+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో 19 సంవత్సరాల మనీష అనే దళిత యువతిని కిరాతకంగా నాలుక కోసి ఆమె మృతికి కారణమైన నలుగురు మానవమృగాలను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని దళిత

నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి

రాజోలు, సెప్టెంబరు 30: ఉత్తరప్రదేశ్‌లో 19 సంవత్సరాల మనీష అనే దళిత యువతిని కిరాతకంగా నాలుక కోసి ఆమె మృతికి కారణమైన నలుగురు మానవమృగాలను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని దళిత చైతన్యవేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోంపల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఈ మధ్యకాలంలో దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.


దళిత మహిళలపై దాడులు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లో కిరాతకంగా ఆధిపత్యవర్గాల నిందితుల చేతి మృతి చెందిన దళిత యువతి మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే స్పందించి ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. దళిత యువత, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు రాజకీయపార్టీలకు అతీతంగా దళితులపై జరుగుతున్న దాడులపై గొంతెత్తి ప్రశ్నించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-10-01T08:57:19+05:30 IST