82 ఏళ్ల వృద్ధుడి విజయం
ABN , First Publish Date - 2020-04-08T07:18:18+05:30 IST
కరోనా వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా..
ఢిల్లీ, ఏప్రిల్ 7: కరోనా వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా.. సులభంగా వారిని బలితీసుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఢిల్లీకి చెందిన మన్మోహన్ సింగ్ అనే 82 ఏళ్ల వ్యక్తి అందుకు భిన్నంగా, కరోనాపై పోరాటంలో విజయాన్ని సాధించాడు. స్థానిక లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన సింగ్ను త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. చక్రాల కుర్చీలో మన్మోహన్ కూర్చుని ఉండగా.. చుట్టూ సంతోషంతో ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు చూస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసాధ్యమనుకున్న కేసుల్లో ఇలాంటి అపూర్వ విజయాలు సాధించడం.. కరోనాను తరిమికొట్టగలమనే ధైర్యాన్ని పెంచుతుందంటూ వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు.