ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-01-21T05:51:28+05:30 IST

ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీగా తాతా మధు ప్రమాణస్వీకారం
ప్రమాణస్వీకారం చేస్తున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌

ఖమ్మం, జనవరి 20 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలిలో ప్రొటెం స్పీకర్‌ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రి తన చాంబర్‌లో మధుతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రమంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహబూబ్‌అలీ, సత్యవతిరాథోడ్‌, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, బాణోత్‌ హరిప్రియతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఖమ్మం జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రైతు బంధు ఖమ్మం జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, తదితరులు హాజరై ఎమ్మెల్సీగా ప్రమాణంచేసిన మధుసూదన్‌ను అభినందించారు. 



Updated Date - 2022-01-21T05:51:28+05:30 IST