ఆ డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలి: Bandi Sanjay

ABN , First Publish Date - 2022-06-22T20:37:59+05:30 IST

Hyderabab: యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు (Telangana BJP President) బండి సంజయ్ సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు

ఆ డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలి:  Bandi Sanjay

Hyderabab: యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు (BJP Telangana President) బండి సంజయ్  సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే రైతుల నుంచి కొన్న వడ్లకు రూ.517.16 కోట్లను ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్షించి పరష్కరించాలని,  ఖరీఫ్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-22T20:37:59+05:30 IST