‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని అడిగిన ప్రియుడు.. చివరకు ఆమె చెప్పిన సమాధానం విని..

ABN , First Publish Date - 2022-03-04T01:47:22+05:30 IST

ఢిల్లీలో ఇద్దరు ప్రేమికుల మధ్యన చోటు చేసుకున్న ఘటన.. చివరకు స్థానికులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని విసుక్కుంటూ ప్రియురాలిని అడిగాడు ప్రియుడు...

‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని అడిగిన ప్రియుడు.. చివరకు ఆమె చెప్పిన సమాధానం విని..

కొన్నిసార్లు ఒకే ఒక్క చిన్న సంఘటన.. జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. అదేక్రమంలో మరి కొన్నిసార్లు జీవితాన్ని అతలాకుతలం కూడా చేయొచ్చు. లేనిపోని అపోహలు పెట్టుకుని కొందరు ఎదుటి వారిపై కోపం పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారి జీవితాలను నాశనం చేస్తూ ఉండడం మనం ఇటీవల చాలా సందర్భాల్లో చూశాం. ఢిల్లీలో ఇద్దరు ప్రేమికుల మధ్యన చోటు చేసుకున్న ఘటన.. చివరకు స్థానికులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘‘వరుసగా అన్ని సార్లు ఎవరు ఫోన్ చేస్తున్నారు’’.. అని విసుక్కుంటూ ప్రియురాలిని అడిగాడు ప్రియుడు. ఆమె చెప్పిన సమాధానం చివరకు ఎంత వరకు దారి తీసిందంటే..


ఉత్తర్​ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్​ చౌహాన్​కు, ఢిల్లీ వసంత్​కుంజ్​లోని కిశన్​గఢ్​ప్రాంతానికి చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి చాలా ప్రాంతాలను సందర్శించేవారు. వీరిద్దరూ కలిసి గత శుక్రవారం ఢిల్లీలోని హోటల్‌కు వెళ్లారు. సంతోషంగా భోజనం చేస్తుండగా.. మహిళ సెల్‌కు ఫోన్ వచ్చింది. అయితే ఆమె లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా.. మళ్లీ ఫోన్ మోగింది. అయినా ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇలా మీద మీద ఫోన్ మోగుతున్నా కూడా ఆమె లిఫ్ట్ చేయలేదు. అప్పటికే అనుమానంతో ఉన్న శివమ్.. ‘‘ఎవరు! అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు’’.. అని ప్రశ్నించాడు. దీనికి ఆమె ‘‘నా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు’’.. అని బదులిచ్చింది. ‘‘తమ్ముడే అయితే మాట్లాడేందుకు ఇబ్బంది ఏముంది’’ అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆమె తడబడుతూ సమాధానం చెప్పడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది.

పెళ్లికాని కుర్రాళ్లే వీళ్ల టార్గెట్.. 11 రాష్ట్రాల్లో 1400 మంది బాధితులు.. ఫోన్ చేసి ఏం మాట్లాడతారంటే..!


‘‘నాకు తెలీకుండా ఎవరితో మాట్లాడుతున్నావ్.. చెప్పు! ఎవడు వాడు’’.. అంటూ నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మహిళ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన శివమ్.. ఆమె తలను నేలకేసి కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె.. అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే హోటల్ నుంచి ఒకడే వెళ్తుండడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని  ఉత్తర్​ప్రదేశ్​లోని మితౌలీ ప్రాంతంలో అరెస్టు​ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మగలరా..? 6నెలల్లోనే 16 కేజీల బరువు తగ్గి.. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత..

Updated Date - 2022-03-04T01:47:22+05:30 IST