ఉన్నదంటే...వైసీపీ నేతలకు ఉలికిపాటు
ABN , First Publish Date - 2021-06-20T06:36:07+05:30 IST
ఉన్నదంటే వైసీపీ నాయకులకు ఉలికిపా టు ఎందుకని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప ఎద్దేవా చేశారు.
- టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప
అనంతపురం విద్య, జూన్ 19 : ఉన్నదంటే వైసీపీ నాయకులకు ఉలికిపా టు ఎందుకని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప ఎద్దేవా చేశారు. టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదే ళ్ల పాలన చూసిన దేశమంతా ఆంధ్రా వై పు చూసిందని, అదే ఇప్పుడు రాషా్ట్రన్ని మరో బీహార్గా మారుస్తు న్నారని అన్నారు. ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడురోజుల కిందట కర్నూలు జిల్లా లో జరిగిన హత్యలు చూస్తుంటే....రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉం దా....రాజా రెడ్డి సామ్రాజ్యం నడుస్తోందా... అన్న సందేహాలు కలు గకమానవన్నారు. జంట హత్యల నిందితులను అరెస్టు చేయాలని, సీబీఐతో విచారణ చేయించాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశా రన్నారు. అయితే వైసీపీ నాయకులు తమ నాయకుడి నాలుక కోస్తాం, అంతు చూస్తాం అనడం చూస్తుంటే....వారి వైఖరి ఏంటో ఇట్టే స్పష్టమవుతోందన్నారు. పాదయాత్రలో ఇంటికో ఉద్యో గమని చెప్పిన సీఎం జగన నేడు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలే దన్నారు. వలంటీర్ పోస్టులు మినహా చేసిందేమీ లేదని విమర్శిం చారు. సీపీఎస్ విషయంలోనూ ఉద్యోగులకు ఇచ్చిన మాట నేటికీ నిలుపుకోలేదని, నిరుద్యోగులను నిలువునా ముంచారని అన్నారు. రాష్ట్ర ప్రజులు ఇవన్నీ చూస్తున్నారని అన్నారు. ఏదిఏమైనా ప్రజలు, యువకులు, నిరుద్యోగులు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.