కశ్మీర్‌లో snowfallతో 37 విమాన సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-01-06T12:35:49+05:30 IST

జమ్మూకశ్మీర్ అంతటా మంచు విస్తారంగా కురుస్తుండటంతో 37 విమాన సర్వీసులు రద్దు చేశామని...

కశ్మీర్‌లో snowfallతో 37 విమాన సర్వీసుల రద్దు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ అంతటా మంచు విస్తారంగా కురుస్తుండటంతో 37 విమాన సర్వీసులు రద్దు చేశామని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు. మంచు కురుస్తుండటం వల్ల విమానానికి దారి కనిపించక పోవడంతో శ్రీనగర్ నుంచి పలు నగరాలకు రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశామని అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్ నుంచి 42 విమానాలు షెడ్యూల్ చేయగా వీటిలో 37 విమాన సర్వీసులను రద్దు చేశామని విమానాశ్రయ అధికారులు వివరించారు.విమానాల రద్దు కారణంగా వందలాది మంది ప్రయాణికులు శ్రీనగర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 


‘‘ఈరోజు తేలికపాటి హిమపాతం వల్ల విమానయానానికి దారి కనిపించక పోవడంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగింది, 42 షెడ్యూల్డ్ విమానాల్లో కేవలం ఐదు మాత్రమే నడిపాం...37 విమాన సర్వీసులను రద్దు చేశాం’’ అని విమానాశ్రయ అధికార అధికారి తెలిపారు.కశ్మీర్ లోయలోని చాలా ప్రదేశాలలో క్రిస్మస్ సందర్భంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.విమాన సర్వీసుల రద్దుతో పర్యాటకులు శ్రీనగర్‌లోనే ఉండాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు.


Updated Date - 2022-01-06T12:35:49+05:30 IST