థామస్‌ కప్‌ విజేతకునగదు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2022-05-25T07:30:55+05:30 IST

థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ విజేతల్లో ఒకడైన కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్‌కు రెడ్‌ కాన్వెంట్‌ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ రూ.50 వేలు నగదు ప్రోత్సాహం ప్రకటించారు.

థామస్‌ కప్‌ విజేతకునగదు ప్రోత్సాహం
ఫొటో : కృష్ణప్రసాద్‌కు నగదు అందిస్తున్న దృశ్యం

రూ.50 వేలు అందజేసిన రెడ్‌ కాన్వెంట్‌ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ

కాకినాడ స్పోర్ట్స్‌, మే 24: థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ విజేతల్లో ఒకడైన కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్‌కు రెడ్‌ కాన్వెంట్‌ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ రూ.50 వేలు నగదు ప్రోత్సాహం ప్రకటించారు. మంగళవారం ఈ మొత్తాన్ని కృష్ణప్రసాద్‌కు ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాదం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పాపారావు, రామకృష్ణన్‌, రెడ్నం రమణమూర్తి, వి.సురేష్‌, ఆర్‌.ఆరుణ్‌కుమార్‌, రామ్‌చరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్‌ అభినందన

కాకినాడ సిటీ: థామస్‌ కప్‌లో బ్యాడ్మింటన్‌లో దేశానికి బంగారు పతకం అందించిన భారత బృందం సభ్యు డు జి.కృష్ణప్రసాద్‌ను కలెక్టర్‌ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తనను కలిసిన క్రీడాకా రుడికి కలెక్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. భారత బృందం సాధించిన ఈ విజ యం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుం దన్నారు. మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమై దేశంలో బ్యాట్మింటన్‌ క్రీడా వికాసానికి దోహదం కాగలదని కలెక్టర్‌ ఆకాంక్షించారు. 




Updated Date - 2022-05-25T07:30:55+05:30 IST