థామస్ కప్ విజేతకునగదు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2022-05-25T07:30:55+05:30 IST
థామస్ కప్ బ్యాడ్మింటన్ విజేతల్లో ఒకడైన కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్కు రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ రూ.50 వేలు నగదు ప్రోత్సాహం ప్రకటించారు.
రూ.50 వేలు అందజేసిన రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ
కాకినాడ స్పోర్ట్స్, మే 24: థామస్ కప్ బ్యాడ్మింటన్ విజేతల్లో ఒకడైన కాకినాడకు చెందిన గరగ కృష్ణప్రసాద్కు రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థి శ్రీవత్సవ రూ.50 వేలు నగదు ప్రోత్సాహం ప్రకటించారు. మంగళవారం ఈ మొత్తాన్ని కృష్ణప్రసాద్కు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పాపారావు, రామకృష్ణన్, రెడ్నం రమణమూర్తి, వి.సురేష్, ఆర్.ఆరుణ్కుమార్, రామ్చరణ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అభినందన
కాకినాడ సిటీ: థామస్ కప్లో బ్యాడ్మింటన్లో దేశానికి బంగారు పతకం అందించిన భారత బృందం సభ్యు డు జి.కృష్ణప్రసాద్ను కలెక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్లో తనను కలిసిన క్రీడాకా రుడికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత బృందం సాధించిన ఈ విజ యం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుం దన్నారు. మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమై దేశంలో బ్యాట్మింటన్ క్రీడా వికాసానికి దోహదం కాగలదని కలెక్టర్ ఆకాంక్షించారు.