థాయ్‌ కంపెనీ నుంచి ఆండ్రాయిడ్‌ హెచ్‌డీ టీవీలు

ABN , First Publish Date - 2020-09-24T06:04:59+05:30 IST

థాయ్‌లాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లయెన్సుల కంపెనీ ట్రీవ్యూ భారత మార్కెట్లో క్యూత్రీ వెంచర్స్‌ భాగస్వామ్యంలో స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ ఫుల్‌ హెడీ టీవీలను విడుదల చేసింది.

థాయ్‌ కంపెనీ నుంచి ఆండ్రాయిడ్‌ హెచ్‌డీ టీవీలు

న్యూఢిల్లీ:  థాయ్‌లాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లయెన్సుల కంపెనీ ట్రీవ్యూ భారత మార్కెట్లో క్యూత్రీ వెంచర్స్‌ భాగస్వామ్యంలో స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ ఫుల్‌ హెడీ టీవీలను విడుదల చేసింది. వీటిలో 32 అంగుళాల నుంచి 65 అంగుళాల మధ్య స్ర్కీన్‌లో టీవీలున్నాయి. స్మార్ట్‌ యాప్‌లను (ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ కాస్ట్‌, ఈ షేర్‌, మిరాకాస్ట్‌ వంటివి) వీటితో అనుసంధానమై వస్తాయని కంపెనీ ప్రకటించింది. వీటన్నింటి మీద ఏడాది రీప్లే్‌సమెంట్‌ (ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే) వారెంటీ, దేశవ్యాప్త సర్వీసింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. తమతో భాగస్వామ్యం ఉన్న కన్సూమర్‌ ఎలక్ర్టానిక్‌ స్టోర్లలో ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. తమ టీవీలకు హృతిక్‌ రోషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటారని ప్రకటించింది. 

Updated Date - 2020-09-24T06:04:59+05:30 IST