రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి పోస్టుకార్డులు పంపిన తాడేపల్లి రైతులు
ABN , First Publish Date - 2022-04-29T17:35:09+05:30 IST
కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తాడేపల్లి రైతులు పోస్టుకార్డులు పంపారు.
గుంటూరు: కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తాడేపల్లి రైతులు పోస్టుకార్డులు పంపారు. ఈ విషయంపై గవర్నర్కు రాసినా స్పందన లేదంటూ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి రైతులు పోస్టుకార్డులు పంపించారు. యూ-1 రిజర్వ్ జోన్ తొలగించి రైతు కుటుంబాలను ఆదుకోవాలని వినతి చేశారు. 320 మంది సన్నా, చిన్నకారు రైతు కుటుంబాలను ఆదుకోవాలలన్నారు. తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాల్లో 178 ఎకరాలపై యూ-1 జోన్ ఉన్న విషయం తెలిసిందే.