గురుకులాల్లో ప్రవేశాలకు ఒకటిన టీజీసెట్
ABN , First Publish Date - 2020-10-31T07:28:03+05:30 IST
రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నవంబర్ 1న ఆదివారం టీజీసెట్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వేర్వేరు ప్రకటనల్లో కోరారు.
వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్, అక్టోబరు 30: రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నవంబర్ 1న ఆదివారం టీజీసెట్ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మాస్కు ధరించి, హాల్టికెట్, ఆధార్ జిరాక్స్, శానిటైజర్, పరీక్ష ప్యాడ్, బ్లూ/బ్లాక్ బాల్పాయింట్ పెన్ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. నిబంధన మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షకు తీసుకురావాలని కోరారు. ఈమేరకు హన్మకొండలోని పెద్దమ్మగడ్డలోని ఆదర్శ గిరిజన బాలికల కళాశాల ప్రిన్సిపాల్ సురేందర్, హంటర్రోడ్లోని టీఎస్డబ్ల్యుఆర్డీసీడబ్ల్యు ప్రిన్సిపాల్ శంకర్నాథ్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.