గురుకులాల్లో ప్రవేశాలకు ఒకటిన టీజీసెట్‌

ABN , First Publish Date - 2020-10-31T07:28:03+05:30 IST

రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నవంబర్‌ 1న ఆదివారం టీజీసెట్‌ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వేర్వేరు ప్రకటనల్లో కోరారు.

గురుకులాల్లో ప్రవేశాలకు ఒకటిన టీజీసెట్‌

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, అక్టోబరు 30: రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నవంబర్‌ 1న ఆదివారం టీజీసెట్‌ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పరీక్ష కేంద్రాల నిర్వాహకులు వేర్వేరు ప్రకటనల్లో కోరారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. మాస్కు ధరించి, హాల్‌టికెట్‌, ఆధార్‌ జిరాక్స్‌, శానిటైజర్‌, పరీక్ష ప్యాడ్‌, బ్లూ/బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలని పేర్కొన్నారు. నిబంధన మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పరీక్షకు తీసుకురావాలని కోరారు. ఈమేరకు హన్మకొండలోని పెద్దమ్మగడ్డలోని ఆదర్శ గిరిజన బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌ సురేందర్‌, హంటర్‌రోడ్‌లోని టీఎస్‌డబ్ల్యుఆర్‌డీసీడబ్ల్యు ప్రిన్సిపాల్‌ శంకర్‌నాథ్‌ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.  

Updated Date - 2020-10-31T07:28:03+05:30 IST