మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంఘీభావం తెలిపిన టీజీవో నేతలు

ABN , First Publish Date - 2022-03-05T21:59:43+05:30 IST

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి సంఘీభావం తెలిపింది.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంఘీభావం తెలిపిన టీజీవో నేతలు

హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి సంఘీభావం తెలిపింది. ఈమేరకు టీజీవో రాష్ట్ర ప్రెసిడెంట్ మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో పలువురు అసోసియేషన్ నాయకులు మంత్రి హత్యకు కుట్ర జరగడాన్ని ఖండించారు. దేవుని దయంతో కుట్ర ముందే బయటపడడం మంచి జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఆయు రారోగ్యాలతో సంతోషంగా ఉండాలని తాము కోరుతున్నట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రవీందర్ కుమార్, సహదేవ్, రవీందర్ రావు, వెంకటయ్య, అరుణ్ కుమార్, సుజాత, నగర ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యఓుడు క`ష్ణయాదవ్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-05T21:59:43+05:30 IST