గ్రేటర్ గెజిటెడ్ అధికారుల సంఘం నేత గండూరికి పితృ వియోగం

ABN , First Publish Date - 2021-11-22T23:12:12+05:30 IST

తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ మాహా నగర్ అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు కి పితృ వియోగం కలిగింది.

గ్రేటర్ గెజిటెడ్ అధికారుల సంఘం నేత గండూరికి పితృ వియోగం

హైదరాబాద్: తెలంగాణా గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ మాహా నగర్  అధ్యక్షులు గండూరి వెంకటేశ్వర్లు కి పితృ వియోగం కలిగింది.నల్గొండ జిల్లా గుండ్రాం పల్లి లో నివసించే గండూరి సత్యనారాయణ సోమవారం దివంగతులయ్యారు. ఆయన పార్ధీవ దేహానికి సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేత, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పలువురు టీ జీ వో నాయకులు హైదరాబాద్ నుంచి వచ్చి సత్యనారాయణకు నివాళులు అర్పించారు.


తెలంగాణా పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పో పా) రాష్ట్ర అధ్యక్షులు గా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిగా గండూరి వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు.ఈ సందర్భంగా టీ పో పా రాష్ట్ర నిర్వాహక, ప్రచార కార్యదర్శులు మంచాల రవీందర్ మాచన రఘునందన్ లు తమ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-11-22T23:12:12+05:30 IST