టీడీపీ‌లోనే ఉంటా: టీజీ భరత్

ABN , First Publish Date - 2021-02-27T19:31:05+05:30 IST

ప్రశ్నించే వారు ఉన్నప్పుడే పనులు జరుగుతాయని టీడీపీ నేత టీజీ భరత్ పేర్కొన్నారు.

టీడీపీ‌లోనే ఉంటా: టీజీ భరత్

కర్నూల్: తాను టీడీపీ‌లోనే ఉంటానని ఆ పార్టీ నేత టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నించే వారు ఉన్నప్పుడే పనులు జరుగుతాయని చెప్పారు. రూలింగ్ పార్టీ వారికే ఓటేస్తే.. సమస్యలపై ప్రశ్నించే అవకాశం ఉండదని తెలిపారు.  సమస్యలు పరిష్కారం కావాలన్నా.. ప్రజల తరుపున పోరాడాలన్నా టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పారు. ఏపీ‌లో జగన్ ఒక పార్టీ తెలంగాణ‌లో ఆయన సోదరి మరో పార్టీ పెడుతోందన్నారు. ఎవరి మనోభావాలు వాళ్లకి ఉంటాయి.. ఏ పార్టీలో ఉన్నామన్నది కాదు పార్టీ కోసం ఎంత కష్ట పడుతున్నామన్నదే ముఖ్యమని తెలిపారు. సోషల్ మీడియాలో తన మీద తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటానని టీజీ భరత్ తెలిపారు.

Updated Date - 2021-02-27T19:31:05+05:30 IST