టెట్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-07T05:19:07+05:30 IST
టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
నంద్యాల (నూనెపల్లి), ఆగస్టు 6: టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు నాలుగు పరీక్షా కేంద్రాలను అఽధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్ 1, మధ్యాహ్నం సెషన్ 2 పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకున్నారు. హల్టికెట్తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఐడీ కార్డులను పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి అధికారులు అనుమతించారు. నాలుగు పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు సంబంధించి మొత్తం 1,199 మంది అభ్యర్థులకు గానూ, 1,110 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 29 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈవో వసుందారాదేవీ తెలిపారు. నంద్యాల లోని రామకృష్టా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఏడీ అనురాధా పరిశీలించారు.