కరోనా నిర్ధారణ పరీక్ష ఫీజుపై పరిమితి ఎత్తివేత
ABN , First Publish Date - 2020-05-27T08:09:44+05:30 IST
కరోనా నిర్ధారణ పరీక్ష ఫీజుపై పరిమితి ఎత్తివేత
న్యూఢిల్లీ మే 26: కరోనా నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫీజుపై ఉన్న పరిమితిని ఐసీఎంఆర్ ఎత్తివేసింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రైవేట్ ల్యాబ్తో పరస్పర అవగాహనలో భాగంగా ఎంతయినా నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫీజు పరిమితిని ఐసీఎంఆర్ గతంలో రూ.4500గా నిర్ణయించింది.