భారత్కు... టెస్లా...
ABN , First Publish Date - 2020-09-22T21:56:04+05:30 IST
ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ త్వరలో... భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే... తమ ఆర్అండ్డీ(పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
వాషింగ్టన్ : ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమెరికా సంస్థ ‘టెస్లా’ త్వరలో... భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే... తమ ఆర్అండ్డీ(పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేయాలనుకుంటోన్న తొలి ఆర్అండ్డీ కేంద్రం ఇదే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై త్వరలో మరోమారు చర్చలు జరిగే అవకాశాలున్నట్టు కర్ణాటక పరిశ్రమల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టెస్లాకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.
కాగా... భారత్ తర్వత ఓ యూరోపియన్ దేశంలో కూడా టెస్లా తన వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.