ఏపీలో టెస్లా కార్ల ప్లాంట్‌ ?

ABN , First Publish Date - 2021-01-13T06:23:01+05:30 IST

ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’ భారత మారెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టెస్లా ఇండియా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (

ఏపీలో టెస్లా కార్ల ప్లాంట్‌ ?

బెంగళూరులో కంపెనీ నమోదు


బెంగళూరు: ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘టెస్లా’ భారత మారెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టెస్లా ఇండియా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీఐఎంఈపీఎల్‌) పేరుతో బెంగళూరు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)లో కంపెనీని నమోదు చేసింది. ముగ్గురు డైరెక్టర్లను నియమించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాన్ని బెంగళూరులోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


అయితే కార్ల తయారీ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో టెస్లా కార్ల ప్లాంట్‌ను మా రాష్ట్రంలో పెట్టండంటే మా రాష్ట్రంలో పెట్టండని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలు ఎగబడుతున్నాయి.

కర్ణాటక సీఎం యడియూరప్ప తుముకూరు జిల్లాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా టెస్లా ప్లాంట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 



Updated Date - 2021-01-13T06:23:01+05:30 IST