కశ్మీర్లో బీజేపీ నేత బారిపై ఉగ్రవాదుల కాల్పులు
ABN , First Publish Date - 2020-07-09T07:46:12+05:30 IST
కశ్మీర్లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్ వసీం బారితో పాటు ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు...
జమ్ము/శ్రీనగర్, జూలై 8: కశ్మీర్లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్ వసీం బారితో పాటు ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వారు ముగ్గురూ మృతి చెందారు. దీనికి సంబంధించి బారి రక్షణ సిబ్బంది ఎనిమిది మందిని పోలీసులు అరె స్టు చేశారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల్లో.. పూంఛ్ జిల్లాలో ఒక వృద్ధురాలు(65) చనిపోగా మరో మహిళకు గాయాలయ్యాయి.