కశ్మీర్‌లో బీజేపీ నేత బారిపై ఉగ్రవాదుల కాల్పులు

ABN , First Publish Date - 2020-07-09T07:46:12+05:30 IST

కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్‌ వసీం బారితో పాటు ఆయన తండ్రి బషీర్‌ అహ్మద్‌, సోదరుడు ఉమర్‌లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు...

కశ్మీర్‌లో బీజేపీ నేత బారిపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్ము/శ్రీనగర్‌, జూలై 8: కశ్మీర్‌లోని బండీపొరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు షేక్‌ వసీం బారితో  పాటు ఆయన తండ్రి బషీర్‌ అహ్మద్‌, సోదరుడు ఉమర్‌లపై ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు దుండగులు బుధవా రం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వారు ముగ్గురూ మృతి చెందారు. దీనికి సంబంధించి బారి రక్షణ సిబ్బంది ఎనిమిది మందిని పోలీసులు అరె స్టు చేశారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ కాల్పుల్లో.. పూంఛ్‌ జిల్లాలో ఒక వృద్ధురాలు(65) చనిపోగా మరో మహిళకు గాయాలయ్యాయి.  


Updated Date - 2020-07-09T07:46:12+05:30 IST