అఫ్ఘాన్ జైలుపై దాడి.. ఉగ్రవాదుల్లో ముగ్గురు భారతీయులు
ABN , First Publish Date - 2020-08-05T13:59:09+05:30 IST
అఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్ జైలుపై దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఐఎస్ ఉగ్రవాదుల్లో భారతీయులు
ఆత్మాహుతిదళ సభ్యుడు కేరళీయుడు: అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్
కాబూల్, ఆగస్టు 4: అఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్ జైలుపై దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి. పేలుడు పదార్థాలు నింపిన కారుతో జైలు ద్వారం వద్ద తనను పేల్చేసుకున్న ఆత్మాహుతిదళ సభ్యుడు కలుకెట్టియ పురయిల్ ఐజాస్ కేరళీయుడని నిఘా వర్గాలు తెలిపాయి. దాడి చేసిన 11 మంది ఐఎస్ ఉగ్రవాదుల్లో కనీసం ముగ్గురు భారత జాతీయులు ఉన్నారని పేర్కొన్నాయి