300 మంది ఉగ్రవాదులు చొరబడడానికి సిద్ధంగా ఉన్నారు : జనరల్ వీరేంద్ర
ABN , First Publish Date - 2020-07-11T21:26:06+05:30 IST
నియంత్రణ రేఖ మొత్తం టెర్రర్ లాంచ్ ప్యాడ్లు నిండి ఉన్నాయని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ ప్రకటించారు.
శ్రీనగర్ : నియంత్రణ రేఖ మొత్తం టెర్రర్ లాంచ్ ప్యాడ్లు నిండి ఉన్నాయని మేజర్ జనరల్ వీరేంద్ర వాట్స్ ప్రకటించారు. బారాముల్లాలోని నాగూమ్ సెక్టార్ గుండా 300 మంది తీవ్రవాదులు చొరబడడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ప్రకటించారు.
‘‘నియంత్రణ రేఖ వద్ద ఉన్న లాంచ్ ప్యాడ్స్ అన్నింటినీ ఉగ్రవాదులు ఆక్రమించారని మా వద్ద రిపోర్టుంది. దాదాపుగా 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు చొరబడడానికి సిద్ధంగానే ఉన్నారు’’ అని ప్రకటించారు.
నియంత్రణ రేఖ గుండా అనుమానాస్పద కదలికలను గమనించి ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించారు. ‘‘నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను మేము గుర్తించాం. చొరబాటును నిరోధించే కంచెను కత్తిరించి, చొరబడడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశాం’’ అని వీరేంద్ర వాట్స్ పేర్కొన్నారు.