నిబంధనలు బేఖాతర్‌

ABN , First Publish Date - 2020-05-29T09:49:20+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు వ్యా పారులు బేఖాతరు చేస్తున్నారు.

నిబంధనలు బేఖాతర్‌

సాయంత్రం 7 గంటలు దాటినా యథేచ్ఛగా మద్యం విక్రయాలు


నవాబుపేట : లాక్‌డౌన్‌ నిబంధనలను కొందరు వ్యాపారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా ఉదయం నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే కొన్ని చోట్ల మాత్రం మద్యం వ్యాపారులు నిబంధనలను పాటించడం లేదు. నవాబుపేట మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణం సాయంత్రం 7 గంటలు దాటినా విక్రయాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-05-29T09:49:20+05:30 IST