టెన్త్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2022-07-09T13:23:10+05:30 IST

కడలూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు సహచర విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని ఓ

టెన్త్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

                        - నలుగురు తోటి విద్యార్థుల అరెస్టు


పెరంబూర్‌(చెన్నై), జూలై 8: కడలూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు సహచర విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇటీవల తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరైంది. ఆ సమయంలో స్నేహితుడితో విద్యార్థిని తీసుకున్న ఫొటోను చూపిన ముగ్గురు సహచర విద్యార్థులు ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు తెలుపడంతో దిగ్ర్భాంతి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫొటో ఆధారంగా నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధిత బాలిక, నిందితులు వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Updated Date - 2022-07-09T13:23:10+05:30 IST