శుక్రవారం పదోతరగతి ఫలితాలు.. తెలుసుకోండిలా..!
ABN , First Publish Date - 2021-08-05T23:10:47+05:30 IST
శుక్రవారం పదోతరగతి ఫలితాలు.. తెలుసుకోండిలా..!
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం సాయంత్రం 5గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. పాఠశాల రిజల్ట్స్తోపాటు సబ్జెక్టుల్లో ప్రతిభ తెలిపే మార్కుల లిస్టులను కూడా విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదల తరువాత విద్యార్ధులు వాటిని www.bse.ap.gov.in వెబ్ సైట్లో లేదా ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్ల వద్ద పొందవచ్చని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.