జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలి: హైకోర్టు
ABN , First Publish Date - 2020-06-06T22:46:17+05:30 IST
జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా చోట్ల పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్ధానం ఆదేశించింది. సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనవారిని రెగ్యులర్గా గుర్తించాలని చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డిలో టెన్త్ పరీక్షలకు అనుమతించాలని కోర్టును ప్రభుత్వం కోరింది. విద్యార్థులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.