టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-04-22T05:35:58+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని పలువురు తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు


పాయకరావుపేట, ఏప్రిల్‌ 21 : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని పలువురు తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటరమణ తదితరులు ఇక్కడ మాట్లాడుతూ కరోనా పట్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమై నిరవాణ చర్యలు చేపడితే, ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం రాష్ట్రంలో అసలు కరోనా లేదన్నట్టే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనాబారిన పడుతున్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T05:35:58+05:30 IST