రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-11-23T21:12:34+05:30 IST

ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ దగ్గర

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత

రంగారెడ్డి: ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్‌ వేసేందుకు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు వచ్చారు. నామినేషన్లు వేయకుండా వారిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో ఘర్షణ జరిగింది. దీంతో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు శంబీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి తమ నామినేషన్లను దాఖలు వేశారు. 


Updated Date - 2021-11-23T21:12:34+05:30 IST