పిడుగురాళ్లలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-12T00:18:51+05:30 IST
టీడీపీ నేతలు, మున్సిపల్ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
గుంటూరు: టీడీపీ నేతలు, మున్సిపల్ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం నేత యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు శుభాకాంక్షులు తెలుపుతూ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. కాగా మున్సిపల్ సిబ్బంది కటౌట్లు కట్టడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. మున్సిపల్ సిబ్బందితో టీడీపీ నేతల వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురు ఘర్షణకు దిగారు. పిడుగురాళ్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.