గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-09-14T00:21:23+05:30 IST

జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్త పరిస్థితులు

గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత

సూర్యాపేట: జిల్లాలోని మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సంత్ సేవాలాల్ పండుగలో టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటుపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై ఎంపీపీ భర్త ముడావత్‌ కొండనాయక్, అనుచరులు దాడికి దిగారు. రాళ్లతో, కర్రలతో దాడులు చేసారు. పలువురికి గాయాలయ్యాయి. మూడవత శీను పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలింపు. చికిత్స కోసం శీనును ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-09-14T00:21:23+05:30 IST