నాగర్కర్నూల్ జిల్లా కోడెర్ మండలంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-03-26T14:08:35+05:30 IST
ఇసుక పంచాయితీ విషయంలో చెలరేగిన ఘర్షణ గ్రామంలో
నాగర్కర్నూల్: ఇసుక పంచాయితీ విషయంలో చెలరేగిన ఘర్షణ గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లాలోని కోడెర్ మండలంలో గల నాగులపల్లిలో ఇరువర్గాల మధ్య ఇసుక పంచాయితీ జరిగింది. పంచాయితీ తీవ్ర రూపం దాల్చి వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యువకులు తలలు పగులగొట్టుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది యువకులు బైక్కు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.