ఓదెల మల్లన్న ఆలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-10-02T05:30:00+05:30 IST

ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుల సవాల్‌, ప్రతిసవాల్‌ నేపథ్యంలో ఆదివారం ఓదెల మల్లన్న ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఓదెల మల్లన్న ఆలయం వద్ద ఉద్రిక్తత
విజయరమణారావును అరెస్టు చేస్తున్న ఏసీపీ

ఓదెల, అక్టోబరు 2 : ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుల సవాల్‌, ప్రతిసవాల్‌ నేపథ్యంలో ఆదివారం ఓదెల మల్లన్న ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయరమణరావు, కాంగ్రెస్‌ నేతలు పెద్దఎత్తున మల్లికార్జునస్వామి ఆలయానికి చేరుకు న్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా ఏసీపీ అరెస్ట్‌ చేశారు. మల్లికార్జున స్వామి చిత్రపటంపై విజయర మణరావు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇక్క డికి వచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఏసీపీ, సీఐ ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మస్రత్‌, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్‌, మూల ప్రేంసాగర్‌రెడ్డి తదితరులను అరెస్ట్‌చేసి ధర్మా రం, పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. 

నిరసనలు, రాస్తారోకోలు

విజయరమణరావు అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌, విజయ రమణరావు అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల నిరసనలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు మూల ప్రేంసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో గుంపుల, పొత్కపల్లి, అలాగే కొలనూర్‌లో పెద్దఎత్తున నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు.  

Updated Date - 2022-10-02T05:30:00+05:30 IST