చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-09-17T18:42:21+05:30 IST

అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పెద్దపెద్ద రాళ్లు,

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

అమరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు క్షమాపణ చెప్పలని గొడవకు దిగారు. లోపలికి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పెద్దపెద్ద రాళ్లు, కట్టెలతో దాడులు చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి.


ఎమ్మెల్యే జోగి రమేష్ సమక్షంలో ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేతలు ఆరోపించారు. దాడి విషయం తెలుసుకున్న అమరావతి పోరాట సమితి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. జెడ్ క్యాటగిరీ ఉన్న చంద్రబాబుపైనే దాడికి దిగుతుంటే.. ఇక సామాన్యల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దాడిని పోలీసులే ప్రోత్సహించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ దగ్గరుండి మరీ వైసీపీ నేతలను బాబు ఇంటి వద్దకు పంపారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు.

Updated Date - 2021-09-17T18:42:21+05:30 IST