ఆదోని పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-03-14T01:55:25+05:30 IST

జిల్లాలోని ఆదోని పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 18వ

ఆదోని పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కర్నూలు: జిల్లాలోని ఆదోని పురపాలక కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 18వ వార్డు సీపీఎం ఏజెంట్లకు కౌంటింగ్ పాసులు ఇవ్వలేదని సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. కమిషనర్ వాహనాన్ని అడ్డుకుని సీపీఎం నాయకుల ధర్నా చేశారు. పెట్టీ కేసులు ఉన్నాయనే కారణంతో అధికారులు కౌంటింగ్ పాసులు ఇవ్వడం లేదని సీపీఎం తరుపు ఏజెంట్లు ధర్నా నిర్వహించారు.  వైసీపీ తరుపు ఏజెంట్లపై రౌడీ షీట్ ఉన్నా కౌంటింగ్ పాసులు ఇచ్చారని సీపీఎం నాయకులు ఆరోపించారు. 

Read more