కనుల పండువగా వైకుంఠవాసుని తెప్పోత్సవం
ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు.
తెనాలి టౌన్, జనవరి15 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిజాంపట్నం కాలువలో తెప్పోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్, దేవస్థానం కమిటీ చైర్మన్ వుప్పల వరదరాజులు, ఈో శ్రీనివాసరెడ్డి పూజలు నిర్వహించారు. అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ్, అలహరి రవి, శ్రీనివాసరావు, తీర్ధానందం, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తేజస్వి ప్రఖ్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి.