వచ్చే నెల 23 నుంచి పది పబ్లిక్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-02-20T06:47:59+05:30 IST
పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు
ఏలూరు ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 19 : పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. మార్చి 23న ప్రథమ భాష పేపర్-1, 24న పేపర్-2, 26న సెకండ్ లాంగ్వేజ్, 27న ఇంగ్లీషు పేపర్-1, 28న పేపర్-2, 30న గణితం పేపర్-1, 31న పేపర్-2, ఏప్రిల్ 1న సైన్సు పేపర్-1, 3న జనరల్ సైన్సు పేపర్-2, 4న సోషల్ స్టడీస్ పేపర్-1, 6న పేపర్-2, 7న సంస్కృతం, అరబిక్, పర్షియన్ సబ్జెక్టు, 8న ఒకేషనల్ పరీక్షలు జరుగుతాయి.