ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలి
ABN , First Publish Date - 2022-05-19T05:07:35+05:30 IST
రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా దామాషా ప్రకా రం పది శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీజేపీ గిరిజన మోర్చా ఆ ధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
ఉట్నూర్, మే 18: రాష్ట్రంలోని గిరిజనులకు జనాభా దామాషా ప్రకా రం పది శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ బీజేపీ గిరిజన మోర్చా ఆ ధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మోర్చా నాయకులు గుగ్లావత్ శ్రీరాంనాయక్, సట్ల అశోక్, రాథోడ్ రితేష్, మెస్రం భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జనాభా దమాషా ప్రకారం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. నాయబ్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రమేష్, సీపతి లింగాగౌడ్, గంగాధర్, శ్రీకాంత్, సాడిగే రాజేశ్వర్, కాల్వరవి, పాల్గొన్నారు.