దేవాలయాలను పరిరక్షించాలి

ABN , First Publish Date - 2020-09-20T10:22:39+05:30 IST

హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు కోరారు. వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిరస

దేవాలయాలను పరిరక్షించాలి


తుని/తొండంగి/అన్నవరం/కోటనందూరు: హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు కోరారు. వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నిరసనలో ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీల నేతలను అన్యాయంగా అరెస్టు చేయడం ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో తాండవ షుగర్స్‌ చైర్మన్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ, మళ్ల గణేష్‌, శిల్పరశెట్టి జగన్మోహన్‌, జల్లు వాసు, దిబ్బ శ్రీను, కాలిబోయిన కృష్ణ, పాల్గొన్నారు.


అలాగే తొండంగిలోని గోపాలపట్నంలో అంజనేయస్వామి విగ్రహం వద్ద యనమల కృష్ణుడు పూజలు నిర్వహించారు. కోడ వెంకటరమణ, పేకేటి హరికృష్ణ, కటకం ఈశ్వరరావు, మురాలశెట్టి సత్యనారాయణ, బంటుపల్లి అన్వేష్‌, రాజాల చిట్టిబాబు పాల్గొన్నారు. అన్నవరంలో నేతలు యనమల కృష్ణుడు, వరుపుల రాజా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెన్నా శివ, రాజాల చిట్టిబాబు, సరమర్ల మదుబాబు, మెరపల నరసయ్య, బండారు సురేష్‌ పాల్గొన్నారు.


మండలంలోని కేఈ చిన్నయ్యపాలెంలో యనమల కృష్ణుడు, మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిరసన తెలిపారు. తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, అంకంరెడ్డి రమేష్‌, ఎల్‌.భాస్కరరావు, మాతిరెడ్డి భాస్కరరావు, షేక్‌ జానీ, ఎం.సత్తిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T10:22:39+05:30 IST