గుడిలోకి ప్రవేశించిన దొంగ.. తలుపులు తెరవగానే..
ABN , First Publish Date - 2020-10-28T16:12:53+05:30 IST
స్థానిక కాట్పాడి సమీపం ధారాపడవీడులో వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. వేకువ జామున 2 గంటల సమయంలో గోడ దూకి ఆలయంలోకి ప్రవే శించిన ఓ వ్యక్తి హుండీ పగులగొట్టి నగదును సంచిలో వేసుకున్నాci. హుండీ పగులగొడుతున్న శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఆలయ ఉద్యోగులకు సమాచారం
చెన్నై : స్థానిక కాట్పాడి సమీపం ధారాపడవీడులో వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. వేకువ జామున 2 గంటల సమయంలో గోడ దూకి ఆలయంలోకి ప్రవే శించిన ఓ వ్యక్తి హుండీ పగులగొట్టి నగదును సంచిలో వేసుకున్నాci. హుండీ పగులగొడుతున్న శబ్దం విన్న చుట్టుపక్కల వారు ఆలయ ఉద్యోగులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకొని ఆలయ తలుపులు తెరవగా, నగదు తీసుకొని వెళ్లేందుకు యత్నిస్తున్న దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసి కొబ్బరి చెట్టుకు కట్టివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఆలయ ఉద్యోగులు దొంగను వారికి అప్పగించారు. అతను రాణిపేట జిల్లా వాలాజాపేటకు చెందిన వీర (35) అని తెలుసుకొని, హుండీలో దొంగలించిన రూ.2 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.