అమ్మవారి అలంకరణలో శిలువ ఆకారం!

ABN , First Publish Date - 2021-01-16T05:18:40+05:30 IST

కావలి కలుగోళ్ల శాంభవి అమ్మవారికి చేసిన పూల అలంకారంలో శిలువ ఆకారం వివాదాస్పదమైంది.

అమ్మవారి అలంకరణలో శిలువ ఆకారం!
అమ్మవారి చేయి దగ్గర కనిపిస్తున్న శిలువ ఆకారం

కావలి, జనవరి 15: కావలి కలుగోళ్ల శాంభవి అమ్మవారికి చేసిన పూల అలంకారంలో శిలువ ఆకారం వివాదాస్పదమైంది. ఓ భక్తుడు సెల్‌లో ఫొటో తీసి కావలి డీఎస్పీ ప్రసాద రావుకు పంపించగా ఆయన అలంకారం చేసిన పూజారిని అడిగారు. అయితే అది శిలువ అలంకారం కాదని డమరుకం అలంకారమని చెప్పారు. అయినప్పటికీ అది శిలువ  ఆకారం గా కనిపిస్తుండటం, ఇప్పటికే రాష్ట్రంలో పలు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల దృష్ట్యా ఇది వివాదం కాకూడదని ఆ ఆకారం కనిపించకుండా మార్పులు చేయించ టంతో సమసిపోయింది. అయితే భక్తులకు ఆలయం లోపలకు అనుమతులు ఇవ్వకుండా ప్రధాన గేటు నుంచి దర్శించుకునే అవకాశం కల్పించారు. 

Updated Date - 2021-01-16T05:18:40+05:30 IST