రూ.10లక్షలతో ఆలయాల నిర్మాణాలు
ABN , First Publish Date - 2021-06-17T07:08:41+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివసించే ప్రాంతాల్లో వెంకటేశ్వరస్వామి, రామాలయాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు దేవదాయ, ధర్మాదాయ సహాయ కమిషనర్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు.
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 16 : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు నివసించే ప్రాంతాల్లో వెంకటేశ్వరస్వామి, రామాలయాల నిర్మాణాలను చేపట్టనున్నట్లు దేవదాయ, ధర్మాదాయ సహాయ కమిషనర్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఆలయాలు నిర్మించుకోవాలనుకునే వారు ప్రాంతం, స్థలం తదితర వివరాలతో ముందుకొస్తే టీటీడీ అధికారులు పరిశీలిస్తారన్నారు. ఒక్కో ఆలయాన్ని రూ.10లక్షలతో నిర్మించనున్నారని తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఆలయాలు లేకపోతే ప్రాధాన్యం ఇస్తారని, గుర్తించిన ప్రాంతాల్లో పది సెంట్ల స్థలాన్ని రెవెన్యూ అధికారులతో ధ్రువీకరించాలన్నారు. ఈనెల 25తేదీలోపు దేవదాయ, ధర్మాదాయశాఖ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని ఆమె కోరారు.