వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
ABN , First Publish Date - 2020-11-24T05:30:00+05:30 IST
వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
తాండూరు రూరల్: చెంగోల్ వీరాంజనేయస్వామి ఆలయం ఎదుట మంగళవారం సుధీర్ పంతులు బృందం ఆధ్వర్యంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. చెంగోల్ గ్రామానికి చెందిన పట్వారి కిషన్రావు జ్ఞాపకార్ధం ఆయన కూతురు గౌతాపూర్ గ్రామానికి చెందిన దేశ్పాండే శకుంతల, మోహన్రావు దంపతులు రూ.35వేలతో కొనుగోలు చేసిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. సర్పంచ్ జి.మల్లీశ్వరి, జడల అన్నపూర్ణ, అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఈవో శేఖర్గౌడ్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి వాసుపంతులు దంపతులు, పులేందర్చారి, విష్ణుచారి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.