ఇరుకళల పరమేశ్వరి ఆలయ హుండీల లెక్కింపు

ABN , First Publish Date - 2021-06-20T03:21:02+05:30 IST

నెల్లూరు మూలాపేటలో వెలసి ఉన్న ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం హుండీల లెక్కింపు జరిగింది.

ఇరుకళల పరమేశ్వరి ఆలయ హుండీల లెక్కింపు
ఇరుకళల పరమేశ ్వరీ ఆలయంలో హుండీలు లెక్కింపు

నెల్లూరు(సాంస్కృతికం), జూన్‌ 19 : నెల్లూరు మూలాపేటలో వెలసి ఉన్న ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శనివారం హుండీల లెక్కింపు జరిగింది. 2021 మార్చి 29 నుంచి జూన్‌ 19 వరకు రూ.3,54,480 రాబడి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి కూడారి పెంచల వరప్రసాద్‌ తెలిపారు. నెల్లూరు డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కృష్ణచైతన్య పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఒట్టూరు సురేంద్ర యాదవ్‌, ధర్మకర్తలు మారంరెడ్డి కుమార్‌, యండ్లూరు భాస్కర్‌, కూరపాటి వెంకయ్య, సర్వేపల్లి సుజన, దేవస్థానం అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T03:21:02+05:30 IST