పోలింగ్పై తెలుగుదేశం పార్టీ నేతల దృష్టి
ABN , First Publish Date - 2021-03-08T05:23:44+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్పై తెలుగుదేశం దృష్టిసారించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటన విజయవంతం కావడంతో నేతలు, అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు.
విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్పై తెలుగుదేశం దృష్టిసారించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటన విజయవంతం కావడంతో నేతలు, అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. చంద్రబాబు పర్యటనకు నగర వాసుల నుంచి మంచి స్పందన కనిపించడంతో పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమయిందని అభిప్రాయపడ్డారు. అనంతరం అచ్చెన్నాయుడు నియోజకవ ర్గాల వారీగా నాయకులతో మాట్లాడారు. సోమవారంతో ప్రచారం ముగియనున్నందున ప్రతి వార్డులో ప్రజలను కలుసు కునేందుకు దృష్టిసారించాలని, పోలింగ్పై మరింత శ్రద్ధ వహించాలని, వీలైనంత ఎక్కువ మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.