ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరే..!

ABN , First Publish Date - 2020-09-30T12:00:11+05:30 IST

తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యరకర్తలపై చర్యలు తీసుకోవాలని ..

ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోరే..!

సీఐలపై డీఎస్పీకి తెలుగు యువత ఫిర్యాదు


నెల్లూర్డు(క్రైం), సెప్టెంబరు 29: తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యరకర్తలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోవడం లేదని  తెలుగు యువత నాయకులు నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ‘యువత’ నెల్లూరు పార్లమెంటు స్థానం కోఆర్డినేటర్‌ కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ నేతలను కించపరుస్తూ వైసీపీ కార్యకర్తలు పోస్టింగ్‌లు పెడుతున్నారన్నారు.


  దీనిపై నెల్లూరులోని అన్ని పోలీసు స్టేషన్లలో సీఐలకు 50కిపైగా ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి సీఐలు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. దీనికి డీఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు వాసిరెడ్డి చంద్రనాగ్‌, షేక్‌ రసూల్‌, మోపూరు సాయికిరణ్‌, మాలేపాటి శాంతి నాయుడు, గొట్టిపాటి మాధవ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-30T12:00:11+05:30 IST